పాల్వంచ డివిజన్లలో మేయర్ పర్యటన
NEWS Mar 10,2026 03:16 pm
కొత్తగూడెం నగర్ పాలక సంస్థ పరిధిలోని పాల్వంచ 35, 44 డివిజన్లలో మేయర్ గణేష్ పర్యటించారు. డివిజన్లలో ఉన్న పారిశుధ్యం, డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని మేడికుంట చెరువు కబ్జాకు గురైందని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువును పరిరక్షించడంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో పలు డివిజన్లకు చెందిన సీపీఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.