నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ రామాలయంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రామానుజ చార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.