పల్లె నుంచి సోషల్ మీడియా వరకు..
హాస్యంతో పల్లె రాములు గుర్తింపు
NEWS Mar 09,2026 07:12 pm
వరంగల్: నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాములు “పల్లె రాములు”గా సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో వ్యంగ్య హాస్యంతో గ్రామీణ సమస్యలను చూపిస్తూ ఇప్పటివరకు 4 వేలకుపైగా షార్ట్ ఫిల్మ్స్ రూపొందించారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆయనకు 2023లో కాకతీయ కళాపురస్కారం లభించగా, ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాల్లో ఉత్తమ హాస్యనటుడు అవార్డు కూడా దక్కింది.