ధృవీకరణ పత్రాల స్వీకరించిన
నూతన రాజ్యసభ సభ్యులు
NEWS Mar 09,2026 06:12 pm
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో తమ ఎన్నికకు సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలను ఇద్దరు సభ్యులు అందుకున్నారు. రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా వారు ఈ సర్టిఫికేట్లను స్వీకరించారు. రాజ్యసభలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.