సీఎం రేవంత్ పై మోత్కుపల్లి అసంతృప్తి
200 సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు
NEWS Mar 09,2026 04:42 pm
HYD: కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా తమ జాతి సమస్యలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ 200 సార్లు ఫోన్ చేసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన మాదిగల సన్మాన సభకు కూడా తనను ఆహ్వానించలేదని అన్నారు. రాష్ట్రంలో వందల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా తమ వర్గానికి ఒక్కటే ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో మాదిగ వర్గానికి అన్యాయం జరుగుతోందని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.