నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన భువని రాజు (40) సోమవారం రాత్రి 8.30 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కొద్ది నెలల క్రితమే తండ్రి మల్లయ్య మృతి చెందగా, ఇప్పుడు భువని రాజు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కులను కోల్పోయింది. కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.