మూడోసారి (వరుసగా రెండోసారి) భారత్ టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. యావత్ భారతావని ఉప్పొంగేలా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా ఆటగాళ్లు భయంకరంగా రెచ్చిపోయారు. న్యూజీలాండ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఎక్కడ కూడా వారిని కోలుకోనీయకుండా కుమ్మి..కుమ్మి వదిలేశారు. బ్యాటింగ్ లో వరుసగా ముగ్గురు బ్యాటర్స్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోతే.. తరువాత బౌలింగ్ లో టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాటర్లకు ఊపిరి ఆండనీయలేదు. భారీ తేడాతో న్యూజీలాండ్ ఓడిపోయింది.