హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభం
NEWS Mar 09,2026 09:18 am
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి.సాంబశివరావు సూచనలతో డా. ప్రవీణ్, డా. కిషన్ పాల్గొన్నారు. 14–15 ఏళ్ల బాలికలకు ఈ టీకా గర్భాశయ ద్వార క్యాన్సర్ నివారణకు ఉపయుక్తమని తెలిపారు. జిల్లాలో 9824 మంది అర్హులు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 33 మంది సిబ్బందిని శాలువాలతో సన్మానించారు.