ఫైనల్లో టీమిండియా భారీ స్కోర్!
NEWS Mar 08,2026 08:52 pm
అత్యంత కీలకమైన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. కివీస్ ముందు 256 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 3 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా అదరగొట్టాడు. 46 బంతుల్లోనే 33 పరుగులు చేశారు. ఇందులో 3 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి.