ఖానాపురంలో ఘనంగా మహిళా దినోత్సవం
NEWS Mar 08,2026 07:54 pm
ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దాసరి రమేష్ మహిళ వార్డు సభ్యులు, పారిశుధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి ఆధారస్తంభాలని ఆయన అన్నారు. మహిళలను గౌరవించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.