శాసన మండలి భవనం ప్రారంభం
NEWS Mar 08,2026 01:01 pm
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసనమండలిని సీఎం రేవంత్ ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం పాల్గొన్నారు. శాసనమండలిని అత్యాధునిక హంగులతో పునర్నిర్మించగా.. మేళ తాళాల మధ్య సీఎం రేవంత్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాలును కొత్త హంగులతో ముస్తాబు చేశారు.