సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలతో లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి కీలక మలుపుగా మారింది. అయితే కీలక నేత ముప్పళ్ల లక్ష్మణ్ రావు (గణపతి) మాత్రం ఇంకా బయటే ఉన్నారు. గణపతిని లొంగిపోవాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కేంద్ర హోంమంత్రి ఇచ్చిన డెడ్లైన్ నేపథ్యంలో త్వరలోనే గణపతి లొంగిపోతారని అంచనాలు వినిపిస్తున్నాయి. ఆయన లొంగితే దేశంలో మావోయిస్టు శకం ముగిసే అవకాశముంది. గణపతి నిర్ణయమే ఇప్పుడు హాట్ టాపిక్.