'క్రియేటివ్ సిటీ' ప్రకటించిన చంద్రబాబు
NEWS Mar 07,2026 10:36 pm
సృజనాత్మకత గల వారి కోసం అమరావతిలో అత్యాధునికమైన 'క్రియేటివ్ సిటీ'ని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్ తరాలకు వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని న్యూఢిల్లీలో 'రైసినా డైలాగ్-2026' సదస్సులో పాల్గొన్న సీఎం చెప్పారు. అమరావతిలో కేవలం భవనాలు మాత్రమే ఉండవని, అక్కడ డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలు కొలువుదీరుతాయ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 'గ్లోబల్ లీడర్షిప్ సెంటర్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.