ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
NEWS Mar 07,2026 09:17 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్లో మహిళా దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం నర్సింగ్ సిబ్బంది, కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టిజన్ మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజానికి వారు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.