పాఠశాలను సందర్శించిన కలెక్టర్
NEWS Mar 07,2026 09:16 pm
కలెక్టర్ డా. సత్యశారద నల్లబెల్లి మండలం నందిగామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువుపై ఆరా తీశారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ప్రత్యేక తరగతులు, విద్యార్థులకు అందిస్తున్న స్నాక్స్పై వివరాలు తెలుసుకుని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.