స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
NEWS Mar 07,2026 09:15 pm
నర్సంపేట మండలం గురిజాలలోని జడ్పీహెచ్ఎస్ లో ప్రధానోపాధ్యాయులు పాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పి అర్పిత, ఏ చంద్రకళ, నాగరాణిలను సన్మానించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో సగభాగమైన మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈ చంద్రశేఖర్, ఎం ఏ సాదత్, ఎండి రాయబోస్, వి రవి తదితరులు పాల్గొన్నారు.