నర్సంపేట బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
NEWS Mar 07,2026 09:11 pm
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మార్చి 8న నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. సాంబశివరావు తెలిపారు. జిల్లాలో 14–15 ఏళ్ల మధ్య వయస్సు గల 9,824 బాలికలను గుర్తించినట్లు చెప్పారు. సోమవారం నుంచి ఎంజీఎం, సీకేఎం వరంగల్, వర్ధన్నపేట ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ నిర్వహించి, దశలవారీగా పీహెచ్సీలకు విస్తరిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు అర్హులైన బాలికలకు టీకా వేయించాలని కోరారు.