దాము సేవలు చిరస్మరణీయం: డా. రఘు
NEWS Mar 07,2026 03:21 pm
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకట రమణ రెడ్డి (దాము) ప్రజాక్షేత్రంలో అందించిన సేవలు చిరస్మరణీయమని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు అన్నారు. దాము జయంతి సందర్భంగా కొత్త బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా దాము ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రేండ్ల రాజన్న, గడ్డం శివారెడ్డి, గడ్డం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.