ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
NEWS Mar 07,2026 03:24 pm
హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. జిల్లాలోని పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోయిపడి శ్రీధర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం, బిస్వాల్ కమిటీ సిఫారసుల అమలు, ఏటా ₹1000 ఇంక్రిమెంట్, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.