ప్రజాపాలనలో భాగంగా పాఠశాలలు,
అంగన్వాడీ కేంద్రాల శుభ్రపరిచే కార్యక్రమం
NEWS Mar 07,2026 03:19 pm
ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు సందర్భంగా ఖానాపూర్ మండల కార్యాలయం ఆధ్వర్యంలో రాగంపేట, కొత్తూరు గ్రామపంచాయతీలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు గ్రామ సర్పంచ్ రాజు, జాథోత్ వినోద్ కుమార్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శులు మాలతి, శ్రావంతి పాల్గొన్నారు. ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు సూచించారు.