విద్యార్థినులకు NFHC అవగాహన కార్యక్రమం
NEWS Mar 07,2026 12:50 pm
నల్లబెల్లి మండలం ముడ్చకళ్లపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు)లో NFHC ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలాం మిషన్ విద్యా విజ్ఞాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డా. శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు సమయపాలన, వృత్తి ఎంపిక, భవిష్యత్ విద్యా అవకాశాలపై అవగాహన కల్పించారు. అలాగే పాలిటెక్నిక్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రవేశాలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూల్సింగ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.