చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
NEWS Mar 07,2026 11:50 am
2025లో విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరిస్తారు. కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినారే అవార్డును ప్రకటించారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. 2025లో విడుదలైన సినిమాలకు, షార్ట్ఫిల్మ్లకు ఈ అవార్డులు ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది.