నర్సంపేట మున్సిపాలిటీ 9వ వార్డులో నల్లాల లీకేజీలు నీటి ఫౌంటైన్లను తలపిస్తున్నాయని వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి కమిషనర్కు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పలుచోట్ల ఇళ్లకు తాగునీరు అందకపోగా, వచ్చిన నీరు కూడా తక్కువ ప్రెషర్తో సరిపోవడం లేదని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం లోపించిందని, సమస్యలు పరిష్కరించకుండా నల్లా పన్ను, ఇంటి పన్ను వసూలు చేస్తామని చెప్పడం బాధాకరమన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.