ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై సమావేశం
NEWS Mar 07,2026 11:38 am
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా 99 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలపై మహబూబాబాద్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం జరిగింది. ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరైన సమావేశంలో కార్యక్రమం విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే సూచనలు చేస్తూ పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.