గీసుకొండ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖతో సర్పంచుల భేటీ..
NEWS Mar 06,2026 07:55 pm
వరంగల్ జిల్లాలో గీసుకొండ మండలంలో జరిగిన వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మండల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నాయకులు, రాంపురం సర్పంచ్ రడం భరత్ ఆధ్వర్యంలో వంచనగిరి సర్పంచ్ కొమ్ముల కమల బిక్షపతి, సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన యమునా ప్రవీణ్, దశ్రు తండా సర్పంచ్ కేలోతు అమృత బిక్షపతి, మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్ కలిసి మండల అభివృద్ధి పనులు, గ్రామాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న మంత్రి అవసరమైన చర్యలు తీసుకొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.