'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'
NEWS Mar 06,2026 09:19 pm
నర్సంపేట మున్సిపాలిటీ 2వ వార్డులో చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా స్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ-విజేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను పరిశీలించారు. నీటి సమస్యను గుర్తించి పాడైన బోర్లు, బావులను మరమ్మతు చేసి త్వరలో నీటి సరఫరా అందిస్తామని తెలిపారు. అలాగే సీసీ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి వార్డును అభివృద్ధి చేస్తామని చెప్పారు. అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు.