నాటుసారా ముడి పదార్థాల పట్టివేత
NEWS Mar 06,2026 06:22 pm
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముత్తోజిపేట వద్ద వాహన తనిఖీల్లో బుచ్చిరెడ్డి పల్లెకు చెందిన బానోతు రాజన్న కారులో నాటుసారా తయారీకి ఉపయోగించే 300 కేజీల పట్టిక, 100 కేజీల బెల్లం, 5 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు. టాటా విస్టా కారు, మొబైల్ ఫోన్ను కూడా సీజ్ చేశారు.నిందితుడిపై కేసు నమోదు చేశారు ఈ తనిఖీల్లో ఎస్సై శార్వాణి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.