భారత్ దూకుడు - భారీ స్కోర్
NEWS Mar 05,2026 09:15 pm
టీ20 ప్రపంచ కప్ 2026 సెమీస్లో ఇంగ్లాండ్కు భారత్ 254 పరుగులు చేసింది. సంజు శాంసన్ (89: 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ జస్ట్ మిస్సయింది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. సంజుతో పాటు శివమ్ దూబె (43: 25 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 2, అదిల్ రషీద్ 2, ఆర్చర్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.