ఇళ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్
NEWS Mar 05,2026 09:20 pm
మెట్పల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మెట్పల్లి మండలం వెల్లుల్లలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇండ్లను తొందరగా పూర్తి చేయాలను అధికారులను అదేశించారు. జిల్లా పీడీ ప్రసాద్, ఎంపీడీఓ సురేష్, ఎంపీఓ మహేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నారాయణ, హౌసింగ్ ఏఇ శరత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.