పాక్లో అశాంతి, ఆర్థిక సంక్షోభం
NEWS Mar 05,2026 04:36 pm
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ హత్యతో పాకిస్థాన్లో తీవ్ర ఆందోళన, అశాంతి నెలకొంది. పాకిస్థాన్ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా డైలీ డాట్ కామ్ కథనం రాసింది. పాక్లో తీవ్ర శోకం, ఆందోళన నెలకొందని ఆ దేశ మాజీ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ అన్నారు. ఖమేనీ హత్యకు నిరసనగా పాకిస్థాన్ వ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా హింసాత్మక ప్రదర్శనలు చెలరేగాయి. గత కొన్ని రోజులుగా ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో కనీసం 25 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు.