టీ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
NEWS Mar 04,2026 11:07 pm
హైదరాబాద్: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు వేం నరేందర్రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను ఖరారు చేశారు. గురువారం వీరు నామినేషన్లు దాఖలు చేస్తారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్కుమార్, జెట్టి కుసుమకుమార్ తదితరుల పేర్లూ వినిపించినప్పటికీ.. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి పేరు ఖరారైంది.