కొండగట్టు ఆలయ ఈవోగా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రమాదేవి స్వామి వారిని దర్శించుకొని ఆలయ ఆవరణలో భక్తులతో మాట్లాడి ఆలయంలోని వసతులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఈవో తీసుకున్న నిర్ణయాలు యధావిధిగా కొనసాగుతాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే త్వరలో ఆలయంలో ఆన్ లైన్ సేవలు ప్రారంభిస్తామని, భక్తులు సమర్పించే బంగారం, వెండికి రసీదులు అందజేస్తామన్నారు. వీఐపీ భక్తులను, సామాన్య భక్తులను ఒకే విధంగా చూడాలని అధికారులకు, అర్చకులకు సూచించారు.