చంద్రగ్రహణం నేపథ్యంలో 6.47గంటల తర్వాత విడుపు స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. వేసుకున్న బట్టలతో సహా తలస్నానం చేయాలని,. స్నానం చేయడం వల్ల గ్రహణ దోషం తొలగి పోతుందని చెబుతున్నారు. అలాగే పవిత్ర జలంతో ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో ప్రోక్షణం చేయాలని సూచిస్తున్నారు. అనంతరం ఇష్ట దేవునికి దీపం వెలిగించి దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా గ్రహణం ముగిసిన తరువాత దానం చేస్తే చంద్రదోషాలు తొలిగిపోతాయని నమ్ముతారు. అందువల్ల బియ్యం, పాలు, తెల్లటి వస్త్రాలు, వెండి వంటివి దానం చేస్తే మంచిదని చెబుతారు.