సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలన్నీ మూసి వేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసిన అనంతరమే భక్తులకు దర్శనాలు అనుమతిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఏకైక ప్రధాన ఆలయం శ్రీకాళహస్తి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.