నంది పురస్కారాలు అందుకున్న తండ్రికూతురు
NEWS Mar 03,2026 11:29 am
ప్రేమతో నాన్న షార్ట్ఫిలింకి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు విభాగాల్లో డా. సుహాసిని, డా. వేణుగోపాలకృష్ణ నంది పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో మెగా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో వీరికి పురస్కారాలు ప్రధానం చేశారు. ఇప్పటికే తొలి భాగానికి కూడా ఉత్తమ అవార్డులు లభించాయి. వైద్యరంగంలో సేవలందిస్తూ కళారంగంలోనూ విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న తండ్రి–కూతుళ్లైన డాక్టర్ వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సుహాసిని ఈ విజయంతో మరింత గుర్తింపు పొందారు. కుటుంబ విలువలు, భారతీయ సంస్కృతి–సాంప్రదాయాలు, జీవితంలోని కష్టసుఖాలను ప్రతిబింబిస్తూ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.