మే 11 నుంచి జనాభా లెక్కలు!
NEWS Mar 02,2026 10:32 am
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న జనగణనలో భాగంగా 'హౌస్ లిస్టింగ్' ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తిగా ఆన్లైన్ విధానంలో యాప్ ద్వారా చేస్తున్నారు. ఇందుకు 88 వేల సిబ్బంది అవసరం అవుతారని అంచనా. 2025 డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో 621 గ్రామీణ మండలాలు, 9,983 రెవెన్యూ గ్రామాలు, 134 పట్టణాలు ఉన్నాయి. వీటిని ప్రాతిపదికన తీసుకొని జనాభా లెక్కలు చేస్తారు.