ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి
NEWS Mar 01,2026 11:43 pm
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సమయానికి హాజరుకావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. అందిన వినతులను వెంటనే స్వీకరించి, పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.