27 అమెరికా స్థావరాలపై దాడులు..
దద్దరిల్లిన పశ్చిమాసియా!
NEWS Mar 01,2026 01:52 pm
తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇరాన్కు చెందిన IRGC దళాలు నిన్నటి నుంచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. మొత్తం 27 బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు IRGC వెల్లడించింది. వీటిలో ఇజ్రాయెల్లోని టెల్ నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యా కూడా ఉన్నాయి. దీంతోపాటు ఇజ్రాయెల్లోని రక్షణరంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఖతార్ గగనతలం ఆదివారం ఉదయం 7.30 సమయంలో పేలుళ్లతో దద్దరిల్లింది. దాని రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి.