నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
NEWS Mar 01,2026 11:32 am
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబం విజ్ఞప్తి మేరకు వార్డు కౌన్సిలర్ ధోనికల శిరీష నవీన్ ఆమె కుటుంబానికి బియ్యం, నిత్యవసర వస్తువులు అందించి భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటానని తెలిపారు. పేద కుటుంబాల సంతోషమే తమ లక్ష్యమని ఆ దిశగా వార్డు అభివృద్ధికి పని చేస్తానని తెలిపారు.