వేంపేట్: సీసీ కెమెరాల ఏర్పాటు
NEWS Mar 01,2026 11:28 am
వేంపేట్ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల దొంగల భయం పెరగడంతో పోలీసు శాఖ అప్రమత్తం చేశారు. పోలీసుల సూచనల మేరకు గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధుల వెంబడి అత్యాధునిక సీసీ కెమెరాలను బిగించారు. ఈ పనులను సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎలేటి వినోద్ రెడ్డి,క్యాషియర్ బండారి సంతయ్య, ముస్కు శేఖర్ రెడ్డి పనులు పర్యవేక్షించారు