కాబూల్లో భారీగా పేలుళ్లు
NEWS Mar 01,2026 10:25 am
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున అఫ్గాన్ రాజధాని కాబూల్పై పాక్ వైమానిక దాడులకు పాల్పడటంతో భారీ పేలుళ్లు సంభవించాయి. దీనికి ప్రతిస్పందనగా తాలిబన్ దళాలు పాక్ విమానాలపై కాల్పులు జరిపాయి. గత కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య దాడులు ముదిరాయి. పాక్ జరిపిన ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’ దాడుల్లో 274 మంది తాలిబన్లు మరణించగా, 400 మంది గాయపడినట్లు ఇస్లామాబాద్ ప్రకటించింది. మరోవైపు, తాము 55 మంది పాక్ సైనికులను హతమార్చామని అఫ్గాన్ ప్రతిదాడికి దిగింది. ప్రస్తుతం కాబూల్ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.