కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయి. పేలుడు తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో శ్లాబ్కు పగుళ్లు వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.