నేను ఆరోగ్యంగానే ఉన్నా.. బొత్స
NEWS Feb 28,2026 10:00 am
తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. కేవలం రొటీన్ మెడికల్ చెకప్లో భాగంగానే ఆసుపత్రికి వచ్చినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. గురువారం అర్ధరాత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారని, ICUలో చికిత్స పొందుతున్నారని, వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని వార్తలు రావడంతో YCP శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.