మధ్యాహ్న భోజనంను పరిశీలించిన సర్పంచ్
NEWS Feb 27,2026 08:07 pm
లక్ష్మీదేవిపల్లి (మం) MPPS హమాలీ కాలని పాఠశాలను సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్, ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు సందర్శించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెను వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు సమతుల్య పౌష్టికాహారం అందించాలని డ్వాక్రా మహిళలకు సూచించారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేదని హెచ్ఎం తెలియజేయగా, త్వరలోనే నిర్మాణం చేపడతామని సర్పంచ్ హామీ ఇచ్చారు.