తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో తాజాగా బకాయిలు విడుదలయ్యాయి. మరోవైపు గ్రామ పంచాయతీలకు సైతం రూ.389 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.