కేజ్రీవాల్, కవితకు భారీ ఊరట!
NEWS Feb 27,2026 12:09 pm
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్, సిసోదియా, కవితకు భారీ ఊరట. మద్యం పాలసీ కేసుపై కోర్టు నిందితులందరి పైన కేసులు కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేశామని, సరైన ఆధారాలు లేకుండానే వీరి పేర్లు కేసులో చేర్చారని CBIపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు తప్పు చేశారనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని, లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని చెప్పింది. ఈ కేసులో CBI అధికారుల పైనే దర్యాప్తు జరగాలని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా అభియోగాలు మోపిన 23 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపింది. వారిపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో CBI విఫలమైందని వ్యాఖ్యానించింది.