అమిత్ షాను కలిసిన కొత్త జంట
NEWS Feb 27,2026 11:43 am
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాకు గణపతి విగ్రహాన్ని బహూకరించి, తమ వివాహ రిసెప్షన్కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లో విజయ్, రష్మిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణలో 4న సాయంత్రం 7 గంటలకు రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు.