T20 WC.. భారత్ రికార్డు స్కోరు
NEWS Feb 26,2026 09:08 pm
T20 WCలోనే భారీ స్కోరును భారత్ జింబాబ్వేపై సాధించింది. సూపర్-8లో కీలక మ్యాచ్లో జింబాబ్వేకు టీమ్ఇండియా 257 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (55) హాఫ్ సెంచరీ, ఆఖర్లో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (50*) 23 బంతుల్లోనే అర్ధశతకం చేశారు. తిలక్ వర్మ (44: 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సంజు శాంసన్ (24), ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) దూకుడుగా ఆడేశారు. రిచర్డ్ ఎంగరవ, ముజరబాని, మపోస, సికందర్ రజా తలో వికెట్ తీశారు.