బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
NEWS Feb 26,2026 12:07 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ వెంకటేశ్వర హిల్స్ కాలనీలో బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో గాయాలయ్యాయి. బిజెపి నాయకురాలు కేతిని సావిత్రి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీధి కుక్కలపై తక్షణమే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.