గురుకుల విద్యార్థినికి సిల్వర్ మెడల్
NEWS Feb 23,2026 10:35 am
మల్యాల: తాటిపల్లి గురుకుల పాఠశాలలో కమలిని (9వ తరగతి) విద్యార్థిని రాష్ట్ర స్థాయి సీఎం కప్ యోగా పోటీలలో సిల్వర్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక తెలిపారు. ఈ నెల 21, 22న హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగిన యోగా ట్రెడిషనల్ విభాగంలో ప్రతిభ కనబర్చిన కమలిని రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించిందన్నారు. కమలిని ఎంపికకు కృషి చేసిన పీఈటీ మధులిక ను ఎంఈవో జయసింహారావు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.